Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


on 2008/10/13 6:08:18

ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి అభిమానులకు, పార్టీ నేతలకు మధ్య విభేదాలు ముదురు తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో చిరంజీవి అభిమానుల నాయకులకు అవకాశం కల్పించక పోవడం పై వరంగల్ లో సోమవారం గొడవ జరిగింది. ఆది కాస్త ముదిరి కుర్చీలు , చెప్పుళ్లు విసురుకోవడం దాకా వెళ్ళింది. పరిశీలాకుణిగా వచ్చీయం వ్యక్తిని వెన్నక్‌కు వెల్ల మని చెప్పడం తో సరిపెట్టుకోకుండా అతని పై దాడికి దిగడానికి ప్రయత్నాన్చడం దాన్ని ఆడ్ద్ఫుకొబోయిన వారిని అభిమానులు చితక బాదడం వరకు వెళ్ళింది. పి. ఆర్. పి. కమిటీల్లో జిల్లా నుంచి 12 మందికి చోటు కల్పించారు. అయితే అభిమాన సంఘాల నాయకులకు చోటు కల్పించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం అయ్యింది. చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు కరాటే ప్రభాకర్, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు నవీన్ లకు కమిటీ లో చోటు కల్పించాలని చిరంజీవిని కలిసి కోరాలని అభిమాన సంఘం ఒక తీర్మానాన్ని చేసింది.

on 2008/10/13 5:54:56

ప్రజారాజ్యం పార్టీ వరంగల్ శాఖలో అభిమానులకు, పార్టీ నేతలకు మధ్య విభేదాలు మొదలైంది. సోమవారం జరిగిన సభ గొడవ కు దారి తీసింది. ఆ గొడవ కుర్చీలు విసురుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చెప్పు ళ్ళు విసురుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ కమిటీల్లో అభిమానులకు స్థానం కల్పించక పోవడం , ముగ్గురు పార్టీ పరిశీలకులు విడి విడిగా గా వచ్చి కార్యకర్తల సమావేశం లో పాల్గొనడం తో గొడవ జరిగిందని సమాచారం. ముందు వేణుగోపాల్, గూడూరు సత్యనారాయణ రెడ్డిలు వేర్వేరుగా వచ్చి సమావేశం లో పాల్గొని వెళ్ళిపోయారు. మరో పరిశీలాకుణిగా సిద్దార్థ గౌడ్ వచ్చారు. ఆయనను చూడగానే చిరంజీవి అభిమానులు రెచ్చిపోయి వెనక్కు వెళ్ళిపొమ్మని నినాదాలు చేశారు. సిద్దార్థ గౌడ్ పై దాడికి దిగడానికి కూడా అభిమానులు ప్రయత్నించారు. దాంతో ఆయన అనుచరులు డాడీని అడ్డుకోబోయారు. వారిని అభిమానులు చితక బదరు. చివరికి పోలీసులు జోక్యం చేసుకొని సిద్దార్థ్ గౌడ్ ను బైటికి తీసుకెళ్లారు. దాదాపు రెండు గంటలపాటు జరిగియం ఈ గొడవలో సిద్దార్థ్ గౌడ్ వెనక్కు వెళ్ళి పోవాలంటు నినాదాలు చేసియన్ అభిమానులు ఆయన పై కుర్చీలు విసిరారు. చెప్పులు కూడా విసిరారని సమాచారం.

on 2008/10/13 5:23:46

ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అందరికన్నా ముందు అక్కడి కి వెళ్ళి వాలేది రాజకీయ పార్టీలే. బాధితులను పరామర్శించే పేరుతో ఈ పార్టీలు చేస్తున్న దే మి టి? సంయమనం పాటించాలని ప్రజలను కోరాల్సిన పార్టీలే వారిని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో రాజకీయ నేతలు ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోమవారం ఒక్క రోజునే టి. డి. పి. , ప్రజారాజ్యం, సి. పి. ఎం.,పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు, అల్లు ఆరవింద్, నోముల నరసింహమయ్య, ఆదివారం కె. సి. ఆర్., అంతకన్నా ముందు బి. జె. పి. నేతలు. ఎం. ఐ. ఎం . నేతలు అదిలాబాద్ జిల్లా లోని భైంసా కు పరుగులు దిశారు. దుర్గా మాత శొభా యాత్ర సందర్భంగా మొదలైన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కర్ఫ్యూ కు దారి తీసింది. గత నాలుగురోజులుగా భైంసా లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది గాయాల పాలయ్యారు. శాంతి బధ్రతల పరిరక్షణకోసం పోలీస్ యంత్రాంగం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా రప్పించింది. ఒకపక్క కర్ఫ్యూ కొనసాగుతున్నా వాటొలీ లో ఒక మతానికి చెందిన ఆరుగురుని సజీవదహనం చేసిన మతోన్మాదుల మారణకాండ ఎంతటి అమానుశామో అందరు ఒక్క సారి ఆలోచించాలి. నిద్రిస్తున్న అమాయకులను సజీవ దహనం చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ఆ ముష్కరులకు మానవత్వం ఇసు మంత కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. గొడవలు, ఘర్షణలతో సంభందం లేని వారి ప్రాణాలను హరించడం ద్వారా ఏమీ సాదించదలుచుకున్నారో పాషాణ హృదయులైన వారికే తెలియాలి. ఏ కులం , మతం అన్నది కాడుఇ ముఖ్యం వారంతా అమాయకులు, కులీ నాలి చేసుకొని పొట్టపోసుకునే వారి పై అంత ద్వేషం ఎందుకు? భైంసా సున్నితమైన ప్రాంతం అని పోలీసు యంత్రాంగానికి తెలుసు. గతం లో అక్కడ మాత ఘర్షణలు జరిగాయి. 1996 లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన అల్లర్లలో ఇద్దరు మృతి చెందారు. అక్కడ రెండు నెలలు కర్ఫ్యూ పెట్టారు. దానికి ముందు కూడా అదిలాబాద్ జిల్లాలో మాత ఘర్షణలు జరిగిన ధాఖలాలున్నాయి. ఈ నేపథ్యం లో అప్రమత్తంగా వ్యవహరించైసియన్ పోలీస్ యంత్రాంగం కొద్దిగా ఎమరుపటుగా ఉండటం తో ఇతాంతి ఉపద్రవానికి కారణ మైంది. ముందు జాగ్రత్తలు తీసుకోక పోగా, కనీసం ఘర్షణలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోనుంటే బాగుండేది. పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాలి. ఇక రాజకీయ నేతలు కూడా ప్రజలను రెచ్చగొట్టే ల వ్యవహరించకుండా చూడాలి. రాజకీయ లబ్ది కన్నా ఘర్షణలను నివారించడానికి చేపట్టే చర్యలకు ఉతం ఇవ్వాలి. పరిస్థితిని చక్కదిద్దుతున్న అధికార యంత్రాంగానికి సహకారాన్ని అందివ్వాలి. మతోన్మాద శక్తులను కూడా ఉక్కుపాదం తో అణచివేయడానికి ప్రభుత్వం కూడా పూనుకోవాలి. ప్రభుత్వం విచారణకు ఆదేశించడం హర్చించ దగ్గదె. విచారణ అనథరం ధొషులుగా తేలిన వారి పై కఠినంగా వ్యవహరించాలి.



on 2008/10/13 3:56:25

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఒండించాలన్నదే అటు టి. డి. పి. , ఇటు పి. ఆర్. పి. ల లక్ష్యం , పట్టుదల. అలాంటపుడు రెండు పార్టీలు కలిసి పనిచేయకుండా టి. డి. పి. లేని కూటమితో కలుస్తామని పి. ఆర్. పి. బాహాటంగా చెబుతుంటే, టి. డి. పి. మాత్రం ఏమీ మాట్లాడకుండా వామపక్షాలను , టి., ఆర్. ఎస్. ను తన వైపు తిప్పు కొడానికి పట్టుదలతో కృషి చేస్తోంది. ఇంతకు పి. ఆర్. పి. తెలుగుదేశం పార్టీని అంతగా ద్వేషించడానికి అసలు కారణం ఏమిటి? అధికారాన్ని సమానంగా పంచుకోడానికి ముందుకు రావాలని సి. పి. ఐ. రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేసిన ప్రతిపాదనను పి. ఆర్. పి. బహిరంగంగా ఎందుకు తిరస్కరించింది? చిరంజీవి తో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర రాజకీయాలను చిరంజీవి కి వదిలి, జాతీయ రాజకీయాల పై దృష్టి పెట్టాలని ప్రముఖ పత్రికాధిపతి చేసిన సూచనను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించారు? ఇంతకు ఆ ఇద్దరి నేతల ఆంతర్యం ఏమిటి అన్నది అందరికి కొంత వరకు ఈపాటికే అర్థం అయి ఉండవచ్చు. రాజకీయ పార్టీని ప్రకటించిన తరువాత చిరు అద్వానీల మధ్య ఫోన్ సంభాషణ నడిచింది. ఎవరు ఎవరికి ముందు ఫోన్ చేశారన్నది ముఖ్యం కాకపోయినా వారి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది వాస్తవమని అప్పట్లో తేలింది. పార్టీ పెట్టిన చిరు ను అద్వానీ అభినందించారని సమాచారం. ఆ తరువాత చంద్రబాబు, చిరు లు రహస్యంగా కలుసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దాన్ని చిరు ఖండించారు కూడా. తాను అన్ని పార్టీల ప్రధాన నేతలను కలిసి మాట్లాడుతానని అప్పట్లో చిరంజీవి చెప్పినా ఆది కార్య రూపం దాల్చలేదు. పార్టీ పెట్టిన తరువాత చిరంజీవి ముఖ్యమంత్రి వై. ఎస్. ను మాత్రం అసలు కలవలేదు. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు.
కాంగ్రెస్, టి. డి. పి. లకు తన ప్రజారాజ్యం పార్టీ ప్రత్యామ్నాయం అని చిరంజీవి బలంగా నమ్ముతున్నారు. పైగా రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించి ముఖ్య మంత్రి గద్దె నెక్కాలన్న ఒక వజ్ర సంకల్పం తోనే చిరంజీవి పట్టుదలతో పార్టీని విజయపథం వైపు నడిపించడానికి కఠోర శ్రమకు కూడా సిద్దం అయ్యరన్నది ఆయన గత ఐదు రోజుల ఉత్తరంద్రా పర్యటన చెప్పకనే చెబుతోంది. తెలుగు దేశం తొమ్మిదేళ్ల పాలన, కాంగ్రెస్ నాలుగున్నరేళ్ల పాలన తో ప్రజలు విసిగి పోయారని కొత్తప్రభుత్వం కావాలని కోరుకోంటున్నారని చిరంజీవి నమ్ముతున్నారు. ప్రస్తుతం రాజకీయ శూన్యత చాలా ఎక్కువగా ఉందని అందువల్లనే ప్రజలు తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారని తన రోడ్ షో ప్రసంగాల్లో చిరంజీవి చెబుతూ వస్తున్నారు. 'మీ పిలుపు మేరకు వచ్చాను. నన్ను , నా పార్టీని గెలిపించుకునే భాద్యత మీదే' అన్న తీరులో చిరంజీవి ప్రసంగాలు సాగుతున్నాయి.
అధికారమే పరమాధిగా చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన ప్రసంగాలు చెప్పకనే చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి పై కన్నేసి ఉంచిన కారణంగానే ఆయన తెలుగుదేశం పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నారు. తనకు కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు ప్రధాన ప్రత్యర్థులని పి. ఆర్. పి. అధినేత వాదన. రాష్ట్రం లో పార్టీ పెట్టి తొలి ప్రయత్నం లోనే అధికారం లోకి రావాలని కలలు కంటున్న చిరంజీవి దాని సాకారం చేసుకోడానికి వామపక్షపార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సి. పి. ఐ. సానుకూలంగా ఉన్న సి. పి. ఎం. కు మాత్రం పి. ఆర్. పి. పై గురి కుదిరినట్లు కనిపించడం లేదు. శనివారం పి. ఆర్. పి. కోర్ కమిటీ లో కీలక సభ్యుడు అల్లు ఆరవింద్ డిల్లీ కి వెళ్ళి సి. పి. ఎం జాతీయ నేతలను కలిసినా వారి నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. అందుకే నేమో ఆదివారం చిరంజీవి తన విజయనగరం రోడ్ షో లో పరోక్షంగ సి. పి. ఎం. పై విరుచుకొని పడ్డారు. రానున్న ఎన్నికల్లో తన పార్టీ ని గెలిపించినట్లైతే, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెబుతున్నారే తప్ప ప్రజా సమస్యలపై పోరాడుతానని కానీ ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని గాని పొరపాటున కూడా చెప్పడం లేదు. అమాయక , పేద ప్రజల నమ్మకాన్ని సొమ్ము చూకోవడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చరేమో నని ఆయన రోడ్ షో ప్రసంగాలను వింటే అర్థం అవుతోంది. తనకు అధికారం కట్టబేడితేనే తాను ఏమైన చేస్తానన్న మాటలు ఆయన నోటి నుంచి వస్తున్నాయి. సంఘ సేవ, సమాజ సేవ చేసిన మహానుభావులు గాంధీ, జ్యోతిభా పూలే, మానవత వాది మదర్ థెరీసా ల చిత్ర పటాలను పెట్టి వారు తనకు స్పూర్తి ప్రదాతలని చిరు చెబుతున్నారు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారు సంఘాసేవ చేశారన్న విషయాన్ని చిరంజీవి గ్రహించాలి.

on 2008/10/13 3:54:02


The film Nenu Meeku Telusa starring Manchu Manoj, Riya Sen and Sneha Ullal hit the screens recently. The film got some good openings but many felt that the length of the film was a bit too long. So the director and producer have now embarked upon a damage control exercise and have chopped off about 17 minutes of the film.

A hot beach song featuring Sneha Ullal and Manoj, which was not there in the original, is now being added. Sneha Ullal’s wet song is already making waves and this new beach song is likely to add to the interest of the audience further. It remains to be seen if this ‘Beach Song’ can boost the fate of the film at the box office.

on 2008/10/13 3:41:45



Hero Siddhartha has been having a high profile affair with Bollywood heroine Soha Ali Khan. They are also reported to be having a live-in relationship at Soha’s flat in Mumbai.

Now Siddharth seems to have enticed his heroine in Konchem Ishtamga… Konchem Kasthamga. The two are in hot love and are spending a lot of time together, according to the unit members of the film. Wonder what Soha has to say about this.



on 2008/10/13 3:30:23


Hero Balakrishna’s mega public show ‘Garjana’ will be held in Guntur on November 5. The decision to hold the Garjana was taken at a meeting attended by the TDP chief Chandra Babu Naidu and Balakrishna.

The TDP and the Balayya fans associations will make arrangements for the Garjana. Balayya is expected to take an active interest in politics after the Garjana.

on 2008/10/13 3:01:48


The battle for the audience will be interesting this Sankranthi. While Pawan Kalyan’s Puli directed by SJ Suryah is getting ready for a Sankranthi release, another interesting film Mesthri is also getting ready for release at about the same time.

Dasari Narayana Rao is playing the lead role in Mesthri and the film is expected to have many political overtones. There is likely to be some criticism of Chiranjeevi, who has started his own political party recently.

Mohan Babu is playing a powerful guest role in the film. It is no secret that both Mohan Babu and Dasari Narayana Rao are now bitter critics of Chiranjeevi.

on 2008/10/13 2:59:31




Maverick cinematographer turned director Teja is now all set to release his new film titled Keka. Teja is introducing about 32 new faces with the film. Raja, son of lyricist Sirivennela Seetharama Sasthry is the hero. The heroine is a newcomer and her name is not known.

Teja finally announced the name of the heroine as Ishaani. Teja claimed that the parent’ of the heroine did not give a name for her as per the advise of her astrologers. So it is Teja who has now given her a name.

This may be a gimmick by Teja to raise interest of the audiences’ on the film. Teja claims that his new film will be totally different from the run of the mill films that are coming now. He says that he made Keka out of frustration at the routine films that are being made. The final verdict will be out soon.



on 2008/10/13 2:44:35


కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా నాయకుల్లో తెలంగాణా అంశం పై అనుకూల నిర్ణయం తీసుకోవాలని ఉన్నా ఎవరికి వారు జంకుతున్నారు. మనసులో మాటను గట్టిగా బైటికి వ్యక్తం చేయలేక పోతున్నారు. ఒకరిద్దరు తెలంగాణా రావాలని ఉందని అన్న దాని పై గట్టిగా నిలబడలేక పోతున్నారు. ముఖ్యమంత్రి అభివృద్ది అంటూ జపం చేస్తూ వస్తున్నారు. ఉప ఎన్నికల్లో, దానికి ముందు కూడా తెలంగాణా వాదం బలహీన పడిపోయిందని, కొందరు మాత్రమే తెలంగాణా కావాలని పట్టుబడుతున్నారని సమైక్యవాదంతోనే ముందుకు వెళ్ళాలని వై. ఎస్. గట్టిగా వాదించారు. పార్టీ డిల్లీ లో జరగనున్న సమావేశం లో పాల్గొనడానికి వెళుతున్న ముఖ్యమంత్రి అక్కడ సోనియా గాంధీ వద్ద తెలంగాణా అంశాన్ని ప్రస్తావించే అవకాశ ముంది. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రం లో కాంగ్రెస్ ను తిరిగి అధికారం లోకి తీసుకొచ్చే బాధ్యత తనదని ఆయన సోనియాగాంధీ కి కచ్చితంగా చెప్పవచ్చునని తెలిసింది. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం అవకశవాదమని వై. ఎస్. సోనియాకు వివరించనున్నారు. తెలంగాణకు అనుకూలంగా టి. డి. పి. నిర్ణయం తీసుకున్నా విపక్ష పార్టీల్లో ఐక్యత లేదని ఆది తమకు ప్లస్ అవుతుందని చెప్పనున్నారు.
వై. ఎస్. అభిప్రాయం ఎలా ఉన్న టి. డి. పి. నిర్ణయం తో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆత్మ రక్షణలో పడింది. తెలంగాణా విషయం లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక జుత్తు పిక్కుంటోంది. తెలంగాణా విషయం తమ వైఖరిని ఇదివరకే స్పష్టంగా చెప్పినట్లుముఖ్య మంత్రి చెబుతున్నారు. రాష్ట్ర మంత్రి బొత్స ఏమో తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరుడు గట్టిన సమైక్య వాది చంద్రబాబు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నపుడు కాంగ్రెస్ కూడా ఒక నిర్ణయం తీసుకొని అసెంబ్లీ లో తీర్మానం చేయడమే మంచిదని చెబుతున్నారు. ఆయన తన అభిప్రాయాన్ని మంత్రిగా వ్యక్తం చేశారో, వ్యక్తి గత అభిప్రాయామో తెలియక పోయిన మొత్తానికి కాంగ్రెస్ లో ను తెలంగాణా ప్రకంపనలు మొదలయ్యింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ మాత్రం వై. ఎస్. పాటే పడుతున్నారు. తెలంగాణా పై తుది నిర్ణయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కి అప్పగించామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. పైగా పార్టీ అధిష్టానవర్గం తెలంగాణా పై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా అసెంబ్లీ తీర్మానం చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రి అభిప్రాయం తో కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది ఏకీభవించడం లేదు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ వాదులు మాత్రం టి. డి. పి. నిర్ణయం వల్ల తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కి గట్టి దెబ్బ తగులుతుందని వాదిస్తున్నారు. తెలంగాణా పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధినేత్రి సోనియా నే నని ఒప్పుకొంటున్నారు. తెలంగాణాపై ఏకాభిప్రాయ సాధన పేరిట గత నాలుగున్నరేళ్లుగా సాగదీసిన కాంగ్రెస్ పార్టీ దానిని గురించి ఎలాంటి నిర్ణయానికి రాకుండానే మధ్యలో రెండో ఎస్. ఆర్. సి. ని తెరపైకి తెచ్చింది. అయితే అదికూడా ఆట కెక్కింది. ఇపుడు మళ్లీ ప్రణబ్ కమిటీ అని అంటోంది. తెలంగాణా విషయం లో కాంగ్రెస్ పార్టీకే ఇప్పటిదాకా స్పష్టత లేదన్నది తేటతెల్ల మైంది. కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణా విషయం లో ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో ఇప్పటికే అర్థం అయిపోయింది. ఆటో, ఇటో తెలుచుకోక పోతే కాంగ్రెస్ తెలంగాణప్రాంత ప్రజల తిరస్కారానికి గురికాక తప్పదనిపిస్తోంది.

(1) 2 3 4 ... 1545 »



Sponsored Links





Copyright Content © 2004 by Bharat Waves  |   |