| << Newer | Post Comments | Older >> |
తెలుగుదేశం పార్టీలో తెలంగాణా వాదం పెను దుమరాన్ని రేపుతోంది. మొదట్లో బలహీనంగా ఉన్న తెలంగాణా వాద అల్పపీడన ద్రోణి క్రమంగా బలపడుతూ పార్టీ నవను ముంచే దిశగా పయనిస్తోంది. క్రమంగా తెలంగాణా వాదాన్ని వినిపించే గొంతుల సంఖ్య ఎక్కువవుతోంది. పార్టీ సీనియర్ నేత, చంద్రబాబు తరువాత ద్వితీయ స్థానం లో ఉన్న దేవేందర్గౌడ్ లేవనెత్తిన తెలంగాణా వాణి క్రమంగా తెలంగాణా ప్రాంతం లోని అన్ని చోట్లకు విస్తరిస్తోంది. రెండు రోజులు పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలను గమనించిన పలువురు తెలంగాణా అనుకూల వదులు దేవేందర్ గౌడ్ తో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. తనను కలిసిన వారితో దేవేందర్ గౌడ్ కూడా చర్చలు జరుపుతూ పార్టీ అదినేతతో జరిగిన బేటీ గురించి వారికి చెబుతున్నారు. ఒకవేళ పార్టీ తనపై చర్యలు తీసుకుంటే తదుపరి ఏమో చేయాలన్నడనిపై దేవేందర్ తన వర్గీయులతో చర్చించి నట్లు సమచరమ్.రెన్దు మూడు రోజులగా పార్టీలో నెలకొన్న పరిణామాలు పార్టీ అధిష్టనాన్ని కలవారానికి గురి చెస్థొన్ది.తెలన్గన వాదాన్ని సామర్దించే వారి సంఖ్య పార్టీలో క్రమంగా పెరగడం చంద్రబాబును ఆందోళనకు గురి చెస్థొన్ది.తెలన్గన ప్రాంతనైకి చెందిన నాగం, కడియం, నరసింహులు, దేవండర్ గౌడ్ వైఖరిని తప్పు పడుతున్నారు. తలసాని శ్రీనివాసయదవ్ అయితే ఏకంగా దేవేందర్గౌడ్ పై యుడాన్ని ప్రకటించారు. ఎర్రబల్లి, కడియం, తదితరులు తెలంగాణా వాదాన్ని వినిపిస్తున్న పార్టీ నిర్యనైకి బద్దులమని చెబుతున్నారు. గుత్తా మాత్రం అధిష్టాన వర్గంతో అమీ తుమీ తేల్చుకోడానికి సిద్దం అయ్యారు. పరిస్థితి పరికిస్తే దేశం పార్టీలో మరో సారి ఆగస్ట్ సంక్షోభం తప్పదా !


