| << Newer | Post Comments | Older >> |
సినిమాలో మూడు గంటలపాటు ఖైదీ సినిమా లో ఖైదీగా నటించానని, ఇపుడు ప్రజలు నన్ను వారి హృదయాల్లో శాశ్విత ఖైదీ అవడం తనకు మాత్రమే దక్కిన అదృష్టమని చిరంజీవి అన్నారు. రాయలసీమ ప్రజాంకిత యాత్ర లో బాగంగా చిరంజీవి బుదవారం మధ్యాన్నం పులివెందుల్లో రోడ్ షో ను నిర్వహించారు. పులివెందులకు రావడానికి ఎవరి అనుమతి అక్కర లేదని చెప్పారు. 'మీ ప్రేమే పాస్పోర్ట్. మీ అభిమానమే వీసా' అని ప్రజల నుద్దేశించి చిరంజీవి చెప్పారు. పులివెందుల అందరిది. మన పులివెందులకు రావడానికి ఎందుకు అందరికి టెన్షన్, విపరీతమైన వత్తిడి , ఏదో జరుగుతుందన్న ఉత్కంఠ ఎందుకు అని చిరంజీవి అడిగారు. చూడండి పులివెందులలో యాత్ర ఎంత చక్కగా సాగిందో. ఇక్కడి వారు ఎంతో మంచి వారు అని అన్నారు. ప్రజా బలాన్ని ఎవరు అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
తన యాత్ర కు జనం విరగబడటం చూసి ఉద్వేగానికి లోనైనా చిరంజీవి ఎంతో బావోద్వేగంతో ప్రసంగించారు. 'నన్ను అందరు ఆదరిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా నన్ను ఆదరించిన మీకు నాకు మద్య ఉన్న అనుబందం రాజకీయాలకు ఆతీతమని ' చిరంజీవి తెలిపారు. పులివెందుల ఎంతో అభివృద్ది చెందిందని అంటూ తమ పార్టీ అధికారం లోకి వస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. చిరంజీవి పర్యటనలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొంటాయో నని భయపడిన వ్యాపారులు స్వచ్చందంగా తమ షాపులను మూసి వేశారు. చిరంజీవి రోడ్ షో ముగిసే దాకా బయటకు రావద్దని పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. చిరంజీవి కూడా తన షో ను త్వరగా ముగించుకొని ముందుకు వెళ్లారు.


