| << Newer | Older >> |
on 2008/7/22 0:45:56
లోక్సభ ప్రత్యేక సమావేశం సంధర్బంగా సభను నడుపుతున్న స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీ తీరుపై పలువురు ప్రశంసలు కురిపించారు. స్పీకర్ స్థానం లో కూర్చున్న తనకు తార తమ బేధాలు లేవని మరోసారి ఆయన నిరూపించుకున్నారు. సభ లో తన పార్టీకి చెందిన వారు వివాదం లేవదిసినపుడు కూడా స్పీకర్ నిష్పక్షపాతంగా నడుచుకున్నారు. సభ లో ఇష్టనుసారం వ్యవహరిస్తే చర్య తప్పదని హెచ్చరించారు. విజీటర్స్ గ్యాలరినుంచి సభను స్పీకర్ నడిపిన తీరును మాజీ స్పీకర్లు, సోమ్నాథ్ భార్య, కుమార్తె, బృందా కారత్లు వీక్షించారు. సభలో జరిగిన చర్చ సంధర్బంగా ఉద్రేకాలు,హాస్య ధోరణులు చోటు చేసుకున్నాయి. బి.ఎస్.పి. ఎస్. పి. సభ్యులమధ్య వివాదం బాగా జరిగింది. ఆది ముదిరి ముష్టి యుద్దం దాకా వెళ్ళింది. రాజకీయ అంశాల కన్న వ్యక్తి గత అంశానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.రహుల్ గాంధీ మాత్రం చాలా గంభీరంగా కనిపించారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



