| << Newer | Post Comments | Older >> |
ఉప ఎన్నికల ఫలితాలను బాగా పరికిస్తే తెలంగాణ సెంటిమెంట్ ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అన్న ప్రశ్నలు ఉద ఇంచక మానదు. ఈ ఉపఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పని చేయలేదని చెప్పడానికి వీలులేదు . ఎందు కంటే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని విశ్వసించిన కారణంగానే కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ ను జపీంచాయన్నది నగ్న సత్యం. తాము తెలంగాణకు వ్యతిరేకమని కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు ఉప ఎన్నికల ప్రచారంలో చెప్పకపోవడం తో పాటు తెలంగాణ ప్రాంత అభివృద్ది తమ హయాం లోనే జరిగాయనీ చెప్పడం గమనించాల్సిన విషయం. 2004 లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన టి. ఆర్. ఎస్ . పార్టీ తెలంగా ప్రాంతం లోని 26 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన పరిణామాల కారణంగా టి. ఆర్. ఎస్. లో చోటు చేసుకున్న అసమ్మతి వల్ల ఆ పార్టీకి చెందిన 10 మంది అసమ్మతి శాసన సభ్యులు తిరుగుబాటు చేసి విడిగా ఉండిపోయారు. మిగిలిన 16 మంది శాసన సభ్యులు టి. ఆర్. ఎస్. అధినేత కె. సి. ఆర్ తో ఉండిపోయారు. తన పార్టీ శాసనసభ్యులతో రాజీనామా చేయించిన కె. సి. ఆర్ ఈ సారి ఎవరితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి ఉపఎన్నికల్లో 7 సీట్లను దక్కించుకున్నారు తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం తో పాటు తెలంగా కోరుకుంటున్న కె. సి. ఆర్ ఆ ప్రాంతానికి ఏమీ చేయకుండా కేవలం ఉద్యమానికె పరిమితం అయ్యారని తెలంగాణ అభివృద్దిని విస్మరించారన్న వాదం తో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. పైగా తమ పాలనలోనే తెలంగాణ అభివృద్ది జరిగిందని చెప్పుకుంది. తమ ప్రభుత్వ నాలుగేళ్ళ పాలనలో తెలంగాణ లో ఎన్నో అభివృద్ది పనులు చేపట్టామని అధికార పార్టీ అధినేత వై. ఎస్. తెలంగాణ లో సుడిగాలి పర్యటనలు జరిపి ప్రజలను ఆకట్టు కున్నారు. నిజంగానే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంటే అభివృద్ది మంత్రం పని చేయకుండా పోవాలి. అలాగే ఎన్నికల ముందు తెలంగాణ అనుకూల వాదాన్ని వినిపించిన తెలుగుదేశం పార్టీని తెలంగాణ ఓటర్లు తిరస్కరించాలి. తెలంగాణ వాడానికి సెంటిమెంట్ కు పట్టం కట్టాలి అయితే ఇవేవీ జరగలేదు. టి. ఆర్. ఎస్. మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు గమనిస్తే అర్థం అవుతాయి. అభివృద్ది మంత్రాన్ని జపీంచిన కాంగ్రెస్ కు తెలంగాణ ప్రాంతం లో కేవలం ఐదు సీట్లు మాత్రమే దక్కింది. ప్రభుత్వ పై వ్యతెరేకతను సొమ్ము చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు జరిపిన ప్రచారం. రోడ్ షోవ్లు ఆయనకు కూడా ఎక్కువ సీట్లను ఇవ్వలేదు. ఆ పార్టీ కేవలం నాలుగు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ సాధనే తన ఉపిరి అని. తెలంగాణ సెంటిమెంట్ అనే బ్రంహస్రాన్ని ప్రయోగించిన కె. సి. ఆర్ పార్టీకి 7 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలతో పోల్చి చూసుకుంటే టి. ఆర్. ఎస్ కు ఎక్కువ సీట్లు దక్కడం గమనార్హం అయితే కె. సి. ఆర్ పై నమ్మకం లేని కారంగానే ఆ పార్టీని విశ్వాసంలోకి తీసుకోలేదని అనుకోవాల్సి ఉంటుంది. నిజంగా తెలంగాణాను కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ప్రత్యేక తెలంగాణ ను ఆశిస్తున్న కారంగానే ఆ ఈ సారి దాయతాలచి 7 సీట్లు కట్టబెట్టారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లోనూ కె. సి. ఆర్. కు వచ్చిన మెజారిటీ ఎన్నికలతో పోల్చుకుంటే చాలా తక్కువ అనే చెప్పాలి. కేవలం 15 వేల ఓట్ల మెజారిటీతో కె. సి. ఆర్. గెలిచారు. 2006 లో కారంనగర్ లోక్ సభ సీటుకు జరిగిన ఉపెన్నికలో కె. సి. ఆర్. రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. దానితో పోల్చి చూస్తే ఈ సారి ఆయన కు వచ్చిన మెజారిటీ చాలా తక్కువ. కేవలం తెలంగా ఉద్యమం నీరుకరాకుడన్న కారంగానే తెలంగాణ ప్రజలు ఆయనకు ఓటువేశారు అని చెప్పాలి. ఉద్యమాన్ని బతికించాలన్న ఒకే ఒక్క కారంగానే కె. సి. ఆర్ ను ఒడ్డున పడేశారు అని అనుకొవలి.తెలన్గన సాదించాలన్న ప్రజల కోర్కేను సొమ్ము చేసుకోవడం లో కె. సి. ఆర్. విఫలమయ్యరు.తెలన్గను బలంగా కోరుకుంటున్న శక్తులను ఒక తటిమీదకు తెచ్చి ఐక్యంగా తిరిగి పోరాడతే తప్ప టి. ఆర్. ఎస్. కు భవిష్యత్తు లేదు అని చెప్పాక తప్పదు. తెలంగాణ సెంటిమెంట్ అక్కడికి పోలేదు. ప్రజల్లో బలంగానే ఉంది. దానిని సరిగ్గా వినియోగించుకోలేని టి. ఆర్. ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఓడింది.


