| << Newer | Post Comments | Older >> |
పొత్తుల విషయం లో తాము సుముఖంగా ఉన్న తమ షరత్తులకు అంగీకరించే పార్టీలతోనే తాము కలిసి పని చేస్తామని పొత్తులు పెట్టుకుంటామని టి. ఆర్. ఎస్. మరోసారి చెబుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తో డిల్లీలో టి. ఆర్. ఎస్. పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు కలిసి మంతనాలు జరిపారు. ఆ తరువాత వారిద్దరూ మాయావతి ఇంట్లో అల్పాహార విందుకు హాజరు అయ్యరూకూడా. తెలంగాణా విషయం లో తెలుగుదేశం పార్టీ తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని టి. ఆర్. ఎస్. డిమాండ్ చేస్తోంది. ప్రణబ్ కమిటీకి రాసిన లేఖను వాపసు తీసుకోవడం తో పాటు తెలంగాణా విషయం లో తన వైఖరిని పార్టీ ఖచ్చితంగా వెల్లడి చేస్తే తమకు టి. డి. పి. తో పొత్తుకు ఎలాంటి అభ్యంతరం లేదని టి. ఆర్. ఎస్. అంటోంది. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెబుతున్న తెలుగుదేశం పార్టీ కూడా మరో రెండు, మూడు నెలలు వేచి చూసే ధోరణి అవలంభించనుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చూపంత మహా కూటమి పై ఉంది. వామపక్షాలు. బి. ఎస్. పి., టి. ఆర్. ఎస్. లను కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. కూటమి ఏర్పాటు తరువాత టి. ఆర్. ఎస్. విషయం గురించి, తెలంగాణా పై కూడా ఒక నిర్ణయానికి రావాలని పార్టీ అభిప్రాయ పడుతోంది.


