| << Newer | Post Comments | Older >> |
తెలుగుదేశం పార్టీలో నెంబర్ టు పొజిషన్ లో ఉన్న ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, బి. సి. నేత దేవేందర్ గౌడ్ తెలంగాణా విషయం లో ఏ మాత్రం తొందరపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఇప్పటికీ దేవేందర్ గౌడ్ కు ఆదరణ తగ్గలేదు. తెలంగాణా విషయం లో చాలా గట్టి పట్టుదలతో ఉన్న దేవేందర్ గౌడ్ టి. డి. పి. ని వీడి పోతారన్న ఉహాగానాలు ఒక పక్క జోరుగా వినిపిస్తున్నా, ఆయన మాత్రం లో చాలా గుంభ నంగ ఉంటున్నారు. పార్టీని వీడి పొనని దేవేందర్ గౌడ్ చెబుతున్నా మాటలను పార్టీలో చాలామంది నమ్ముతున్నా దేవేందర్ గౌడ్ ను బైటకు పంప డానికి కొందరు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా దేవేందర్ ఎంతో నేర్పుతో వ్యవహరిస్తున్నారు. పార్టీలో దేవేందర్ గౌడ్ కు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణా పై దేవేందర్ గౌడ్, తలసాని ల మధ్య తలెత్తిన విభేదాలు ముదిరి పాకాన పడకుండా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. రెండు ధఫాలు చంద్రబాబు దేవేందర్ తో చర్చలు జరిపారు.పార్టీ అదినేత చొరవ తీసుకొని మాట్లాడుతున్నపుడు తొందర పాటు పనికి రాదని గ్రహించిన దేవేందర్ గౌడ్ ఆచి తూచి అడుగెస్తున్నారు. పైగా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ నెల 18 న సమావేశమై రాష్ట్రం లోని మూడు ప్రాంతాల పై కూలంకషంగా చర్చించ నుం ది . ఆ సమావేశం లో తన వాదనను వినిపించాలని, తెలంగాణా పై గట్టిగానే మాట్లాడాలని నిర్ణయించుకున్న దేవేందర్ అప్పటిదాకా మరో మాట మాట్లాడకుండా మౌనని పాటించాలని బావిస్తున్నారు.దేవేందర్ ను ప్రతి రోజు పలువురు కలుస్తున్నారు. పార్టీ కూడా దేవేందర్ పై ఓ కన్నేసి ఉంచింది.


