| << Newer | Post Comments | Older >> |

పులివెందులలో మంగళ వారం రాత్రి జరిగిన సంఘటన పై విచారిస్తున్నామని కడప జిల్లా ఎస్. పి. చౌహాన్ అన్నారు. జరిగిన ఘటన పై అరా కూడా తీస్తున్నామని చెప్పారు. దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు అన్న దానిపై కూడా సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ అదినేత చిరంజీవి రాయలసీమ ప్రాంత పర్యటన కోసం ప్రజారాజ్యం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేయడానికి వెళ్ళినపుడు మంగళ వారం రాత్రి కొందరు దాడులకు దిగారు. పి. ఆర్. పి. కి చెందిన వాహనాల పై కూడా దాడి చేసి వాటిని ధ్వంసం చేశారు.


