| << Newer | Older >> |
on 2008/10/2 13:56:02
ఎవరికైన వాస్తవాలు రుచించవు. ఉన్నది ఉన్నట్లు చెప్పినా, రాసినా దాన్ని జీర్ణించుకోలేరు. దానికి చిరంజీవి మినహాయింపు కాదు. దక్కన్క్రానికల్ పత్రికలో తమ పార్టీ పై వ్యతిరేక వార్తలు ఎక్కువగా వస్తున్నాయని చిరు నమ్ముతున్నారు. తెలుగు దిన పత్రికల్లో ఈనాడు తమ కు అనుకూలంగా ఉందని అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి అన్ని ఆంగ్ల పత్రికలు చిరు కు సంబంధించిన వార్తలు ఇస్తున్నాయి. అయితే వాటిలో ప్రచురిత మైన వాస్తవాలను చిరంజీవి జీర్ణించుకోలేక పోతున్నారు. ఈనాడులో తనకు అనుకూలంగా వార్తలు వస్తున్నాయని ఆయన సంబర పడుతున్నారు. ఈనాడు అంత్యర్యాన్ని అర్థం చేసుకోవడం లో చిరంజీవి విఫలమయ్యారనే చెప్పాలి. ఒక సామాజిక వర్గాన్ని ఆదరిస్తోందన్న ఆరోపణలను ఆ పత్రిక ఎదుర్కొంటోంది. పైగా తెలుగుదేశం పార్టీ పై సానుభూతి ఉందన్న నిండ కూడా ఆ పత్రిక పై ఉంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడించి అధికారంలోకి రాగలిగిన కూటమితో చిరంజీవి పొత్తు పెట్టు కోవచ్చునన్న ఒక ఆశతో ఆ పత్రిక ప్రజారాజ్యం పార్టీ పట్ల సానుకూల వైఖరితో ఉన్నట్లు చిరంజీవి కి తెలిసి నట్లు లేదు. రానున్న ఎన్నికల్లో వై. ఎస్. ను ఎలాగైనా గద్దె దింపలన్నదే ఈనాడు పత్రికాధిపతి లక్ష్యం. దానికోసం వై. ఎస్. శత్రు వర్గాన్ని ఆయన చేరదియడం చాలా సహజం కూడా.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



