| << Newer | Post Comments | Older >> |
రాష్ట్రంలో వామపక్షా పార్టీల్లో ఐక్యత వట్టి మాటే నని నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ బావిస్తూ వచ్చింది. అయితే రానున్న ఎన్నికల్లో తమ కలిసి పోటీచేయడమే కాదు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక కూటమికి తుది రూపమిచ్చే పని మరింత వేగవంతం కానుంది. ఈ పరిణామం కాంగ్రెస్ కు షాక్ ఇవ్వనుంది. దాంతో పి. సి. సి. చీఫ్ డి. శ్రీనివాస్ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ తో మంత్రాంగం జరుపుతున్నారు. తెలంగాణా విషయం లో కాంగ్రెస్ సానుకూల నిర్ణయం తీసుకుంటే టి. ఆర్. ఎస్. ను తమ వైపు టిప్పుకోవచ్చునని డి. శ్రీనివాస్ వాదన.
పొత్తుల విషయం లో మొన్నటిదాకా సి. పి. ఐ. లో ఉన్న సందిగ్దాత తొలిగి పోయింది. ఇష్టం ఉన్నా లేక పోయినా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తో కలిసి పనిచేయక తప్పేలా లేదు. పార్టీ జాతీయ కమిటీ తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగా ఉండటం తో రాష్ట్ర కమిటీ కూడా టి. డి. పి. తో కలిసి ముందుకు వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతృత్వం లోని యు. పి. ఏ., బి. జె. పి. నేతృత్వం లోని ఎన్. డి. ఏ. లకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ కూటమి కోసం చాలా కాలంగా వామపక్షా పార్టీలు కృషి చేస్తున్నాయి. దాంతో రాష్ట్రం లో కూడా కాంగ్రెస్, బి. జె. పి. లకు వ్యతిరేకంగా తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళాలని వామపక్షా జాతీయ నేతలు తమ రాష్ట్ర నేతలకు సూచించారు.
తెలుగుదేశం పార్టీ తో కలిసి ముందుకు వెళ్ళాలని సి. పి. ఎం. ఎప్పుడో నిర్ణయించినా, సి. పి. ఐ. మాత్రం ఆ పార్టీతో కలవడానికి మొదటి నుంచి అయిష్టంగానే ఉంది. మూడు నెలల కిందట రాష్ట్ర రాజకీయాల్లోకి సినీ నటుడు చిరంజీవి అడుగుపెట్టాడు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. రాష్ట్ర ప్రజల్లో విశేష అభిమానం , యువతలో మంచి క్రేజ్ ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి రావడం తో అతనికున్న సినిమా గ్లామర్ , మచ్చలేని చిరంజీవి వల్ల తమకు లాభిస్తుందని సి. పి. ఐ. బావించింది. ప్రజారాజ్యం పార్టీ తో కలిసి పనిచేయడానికి ముమ్మరంగా ప్రయత్నించింది. తనతో పాటు టి. ఆర్. ఎస్. ను కూడా కలుపు కొడానికి ప్రయత్నించింది.
అయితే జాతీయ స్థాయిలో వామపక్షా పార్టీ లతో గత నాలుగున్నరేళ్లుగా కలిసి ఉద్యమాలు చేసిన టి. డి. పి. తోనే కలిసి ముందుకు వెళ్ళాలని వామపక్షా పార్టీలు నిర్ణయానికి రావడం తో రాష్ట్ర కమిటీలు కూడా అదే నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఉగిసలాటకు స్వస్తి చెప్పాలని సి. పి. ఐ. నిర్ణయించుకున్నట్లు ఉంది. కాంగ్రెస్ ఓటమే తమ ధేయమని చెబుతున్న వామపక్షా పార్టీలు దానికోసం తమ మద్య ఉన్న విబేధాలను పక్కన పెట్టాయి. కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. బి. ఎస్. పి. ని కూడా కలుపుకోవాలని వామపక్షా పార్టీలు బావిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో సీట్ల విషయం లో కూడా వామపక్షా పార్టీలు పట్టీం పులకు పోవడం లేదు. ఖమ్మం జిల్లా లో వామపక్షా నేతల్లో సక్యత అంతగా లేదు. అక్కడ కూడా ఈ సారి బేదాభిప్రాయాలను పక్కన పెట్టి కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. ఇదో శుభ పరిణామం అనే చెప్పాలి. ఎన్నికల దాకా ఈ రెండు పార్టీలు కలిసి ఉంటే అధికార కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టడం ఖాయమని చెప్పవచ్చు.


