| << Newer | Older >> |
on 2008/6/28 9:12:48
ఒక లక్ష్య సాధన కోసం పని చేసే టపుడు అదే ధ్యేయం కావాలి. తెలంగాణా సాధనలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఉధ్యమించాలి. సిద్దాంతాలు వేరైనా తెలంగాణా సాధనే అందరి ఆశయం కావాలి. ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడే అన్ని శక్తులను కలుపుకొని అడుగు ముందుకెయాలి. తెలంగాణా వాదుల ఐక్యతను దెబ్బ తీసే విధంగా పనిచేయడం మంచిది కాదు. శత్రువుకు అసలు అవకాశం ఇవ్వవద్దు. ఇలా సాగింది ప్రొఫెసర్ జయశంకర్ ప్రసంగం. తెలంగాణా సాదన సదస్సు పేరిట శనివారం హైదరాబాద్ లో జరిగిన మేధో మధన సదస్సును ఆయన ప్రారంబించారు. సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలంగాణకు కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా అన్యాయం చేసిందని చెప్పారు. తెలంగాణా రాజకీయ నేతలను ఎదగ నియకుండా అణచివేస్తున్నారని జయశంకర్ అన్నారు. తెలంగాణా విషయంలో తెలుగుదేశం పార్టీ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కోర్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుదన్న నమ్మకం తనకు అసలు లేదని తెలిపారు. తనకు పార్టీలతో పనిలేదని, తాను ఏ పార్టీలోను సభ్యుడిని కాదని చెబుతూనే తెలంగాణా వాదం వినిపించడానికి ఏ పార్టీ పిలిచినా ఆ పార్టీ వద్దకు వెళ్ళి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తానని జయశంకర్ తేల్చి చెప్పారు. వారికి చేయూత నిస్తానని జయశంకర్ స్పష్టం చేశారు. తనకు వ్యక్తులు, పార్టీలు కన్నా తెలంగాణా సిద్దాంతం ప్రధానమని చెప్పడం గమనిస్తే తాను కేవలం టి. ఆర్. ఎస్. కు మాత్రమే పరిమితమని అనుకోవద్దని కె. సి. ఆర్. కు చెప్పకనే చెప్పారు అని అనుకోవాలి. తెలంగాణా సాదన కోసం అందరు కలిసి పనిచేయాలని సూచించడం వెనుక కె.సి. ఆర్., దేవేందర్గౌడ్ లు తెలంగాణాకోసం ఐక్యంగా కలిసి పోరాడాలన్న సందేశం ఉంది. జయశంకర్ ప్రసంగం లో ఎక్కడ టి. అర్.ఎస్ ను విమర్శించలేదు. అలాగే కె. సి. ఆర్. వైఖరిని తప్పుపట్టలేదు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



