| << Newer | Post Comments | Older >> |
లోక్సభ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మరో రెండో రోజుల్లో స్పీకర్ పదవికి రాజీనామా చేయవచ్చునని తెలిసింది. సోమ్నాథ్ సి. పి. ఎం. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 2004 లో కాంగ్రెస్, వామపక్షల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సోమ్నాథ్ స్పీకర్ గా ఎన్నికయ్యారు. . 2004 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు రాలేదు. ఫలితంగా హగ్ ఏర్పడటం తో మతతత్వ పార్టీ అధికారం లోకి రాకూడదన్న ఒకే ఒక కారణంగా 2004 లో వామపక్షాలు కాంగ్రెస్కు బై టి నుంచి మద్దత్తు ఇవ్వాలని నిర్ణయించాయి. దాంతో యు. పి. ఏ. కూటమి ఆవిర్భావం జరిగింది. యు. పి. ఏ. ఉమ్మడి అభ్యర్థిగా సోమ్నాథ్ ఛటర్జీని స్పీకర్ పదవికి ఎన్నుకున్నారు. నాలేగేళ్ల పాటు యు. పి. ఏ. తో కలిసి కాపురం చేసిన వామపక్షాలు అణు ఒప్పందం విషయం లో కేంగ్రెస్ నేతృత్వంలోని యు. పి. ఏ. ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. ఫలితంగా వామపక్షాలు ప్రభుత్వానికి మద్దత్తును ఉపసంహరించాయి. దాంతో ప్రభుత్వం మైనార్టిలో పడి పోయింది. యు. పి. ఏ. ను ఆదుకోడానికి సమాజ్వాదీ పార్టీ ముందుకు వచ్చి మద్దత్తు ప్రకటించింది. ఈ నెల 22 న విశ్వాస పరీక్షకు ప్రభుత్వం సిద్దం అయింది. ఒక సారి స్పీకర్ గా ఎన్నికైన వారు పార్టీలకు అతీతంగా నడుచుకోవాలి. సోమ్నాథ్ సి. పి. ఎం పార్టీ అభ్యర్థి గా ఎన్నికైనా స్పీకర్గా వ్యవహరిస్తున్న కారణంగా ఆ పదవికి రాజీనామా చేయమని చెప్పడం సబబు కాదని మొదట్లో సి. పి. ఎం. కూడా బావించింది. రాజీనామా విషయాన్ని స్పీకర్ కె వదిలి వేసింది. స్పీకర్ కూడా రాజీనామా చేయాలా వద్ద అన్నది నాకు వదిలివేయండని గతంలో అన్నారు. అయితే స్పీకర్ పదవికి రాజీనామా చేయడమే మంచిదని సి. పి. ఎం. సోమ్నాథ్కు సూచించినట్లు సమా చారం. దానికి స్పీకర్ సోమ్నాథ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. బహుశ అయన మరో రెండు రోజుల్లో రాజీనామా చేయవచ్చునని తెలిసింది.


