| << Newer | Post Comments | Older >> |
ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందులలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన ప్రజా అంకిత యాత్ర ను విజయవంతంగా పూర్తి చేశారు. చిరంజీవిని చూడటానికి , ఆయన ప్రసంగాన్ని వినడానికి ప్రజలు విరగబడ్డారు. చిరంజీవి రోడ్ షో హిట్ అయింది . పులివెందులలో తనకు లభించిన ఆదరణ చూసి చిరంజీవి పులకించి పోయారు. ప్రజలు తనను ఇంతగా ఆదరించడం చూసి చలించి పోయారు. పులివెందులలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన తో బుదవారం యాత్ర సజావుగా సాగుతుందా అన్న అనుమానం అందరిలో కలిగింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగక పోవడం తో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు. చిరంజీవి అభిమానులు, పి. ఆర్. పి. కార్యకర్తలు, నాయకులు కూడా రోడ్ షో సజావుగా సాగడం పై సంతృప్తి వ్యక్తం చేశారు. వై. ఎస్. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చిరంజీవి యాత్రకు సహకరించడం విశేషం. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


