| << Newer | Older >> |
on 2008/7/26 6:02:22
పార్లమెంట్ సభ్యులకు ముడుపులుఆ వ్యవహారం పై లోక్సభ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీ ఏడుగురు సభ్యులతో ఒక విచారణ కమిటీని నియమించారు. పార్లమెంట్ సభ్యుడు కిశోర్ చంద్ర దేవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ముడుపుల వ్యవహారం పై విచారణ జరపనుంది. ఆగస్ట్ 11 వ తేదీ నాటికీ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పీకర్ కమిటీ ని ఆదేశించారు. యు. పి. ఏ. ప్రభుత్వానికి వామపక్షాలు మద్దత్తును ఉపసంహరించడం తో మైనార్టిలో పడిన ప్రభుత్వాన్ని సమాజ్వాదీ పార్టీ ఆదుకుంది. ఆ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్ద మైంది. రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం ఈ నెల 21, 22 తేదీల్లో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశం లో ప్రభుత్వం విశ్వాస పరీక్ష కోసం తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. విశ్వాస పరీక్షలో విజయం సాదించింది కూడా. అయితే ఓటింగ్ జరగడానికి ముందు సమాజ్వాదీ పార్టీ తమకు ముడుపులను ఆఫర్ చేసిందంటూ బి. జె. పి. పార్టీ కి చెందిన ముగ్గురు పార్లమెంట్ సభ్యులు లోక్సభ లో ఆరోపించడమే కాకుండా తమకు ఆ పార్టీ అడ్వాన్స్ గా అందచేసిన 3 కోట్ల రూపాయల డబ్బు సంచులను పెట్టి దానిని సఖ్యంగా పరిగణనిక్వ్ాలని కోరింది. దాంతో సభ లో గందరగోళం నెలకొంది. సభ కొన్ని గంటలు వాయిదా పడింది. సభులు చేసిన ఆరోపణపై వియరణకు స్పీకర్ న్నాయించారు. ఓటింగ్ జరిగింది. ఓటింగ్ కు గైఋహజారైతే మూడు కోట్ల రూపాయలను ఒక్కో ఎం. పి. కి ఇస్తామని సమాజ్వాదీ పార్టీ తమకు సూచించిదని దానిలో బాగానగా తమ ముగ్గురికి అడ్వాన్స్ గా మూడు కోట్ల రూపాయలను అందజేసినట్లు ఆ ఎం. పి. లు లోక్సభ లో చెప్పి మూడు కోట్ల రూపాయల డబ్బు సంచులను స్పీకర్ ఎదుట ఉంచారు. దానిపై లోక్సభ లోని స్పీకర్ సెక్రెట్రీయెట్ నోట్ల కట్ట లను స్వాదిన పరుచుకుంది.. స్పీకర్ సూచన మేరకు ముగ్గురు బి. జె. పి. పార్లమెంట్ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు స్పీకర్ ఏడుగురు సభ్యులతో ఒక విచారణ కమిటీ నియమించారు. కిశోర్ చంద్ృడేవ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆగస్ట్ 11 న తన విచారణ పూర్తి చేసి స్పీకర్ కు నివేదిక సమర్పించనుంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



