| << Newer | Post Comments | Older >> |
అణు ఒప్పందం పై సంతకాలు జరగడం , ఒప్పందం కుదరడం తో ఉపిరి పీల్చుకున్న కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికల పై చూపు నిలిపింది. ద్రవ్యోల్భణం, అధిక ధరల ప్రబహ్వాం సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ని దెబ్బ తీస్తుందని మొన్నటిదాకా భయపడీయన్ కాంగ్రెస్ పార్టీకి ఇపుడు అణు ఒప్పందం ఒక మంచి ప్రచార ఆష్ట్రంగా మారింది. అణు ఓప్ప్న్డం వల్ల దేశానికి , ప్రజలకు వానాగూరే మేలు గురించి వివరించి వారిని తన వైపు తిప్పుకోవడం ద్వారా, ద్రవ్యోల్భణం, అధిక ధరల తీవ్రతను తగ్గించడం సాద్యమని పార్టీ బావిస్తోంది. విపక్ష పార్టీలన్ని అణు ఓప్ప్న్డం పైనే గురి పెడతాయని దాన్ని సమాదవంత తిప్పి కొత్తగలిగితే తమకు ఢోకా ఉండదని కాంగ్రెస్ ధీమాగా ఉంది.
కేంద్రం లో ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితుల్లో రాష్ట్రంలోను అదే విదం గా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్య మంత్రి వై. ఎస్. బావిస్తున్నారు. సోమవారం డిల్లీలో జరిగిన పార్టీ సమావేశం లో ఈ అంశం పై సోనియా, వై. ఎస్. ల మద్య చర్చజరిగింది. అణు ఒప్పందం పై సంతకాలు జరిగిన తరువాత ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడొనిర్ణయించుకున్నట్లు ఉంది. ఇటీవల సోనియా రాష్ట్రం లో పర్యటించిన సందర్భాల్లో ఆమె ప్రసంగాలను వింటే అవి ఎన్నికల ప్రచార ప్రసంగాలను తలపించాయి. జనవరిలోగా ద్రవ్యోల్భనాన్ని, అధిక ధరలసమస్యలను అధిగమించగలమన్న విశ్వాసం కాంగ్రెస్ లో కలిగింది. దాంతో ముందస్తుకు కాంగ్రెస్ రంగం సిద్దం చేసుకుంటోంది.


