| << Newer | Post Comments | Older >> |
సార్వత్రిక ఎన్నికలు నిర్ణీత గడువుకన్నా ముందు జరిగే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. ఫిబ్రవరిచివరి వారం లో కాని, మార్చి మొదటి వారంలో కాని ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు లేక పోలేదు. లోక్సభ తో పాటు రాష్ట్రం లోని శాసనసభకు కూడా అదే సమయం లో ఎన్నికలు జరగడానికి ఆస్కారం కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్ననందున పార్టీ ని ఎన్నికలకు సిద్దం చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకామండ్ నుంచి సూచనలు అందినట్లు రాష్ట్రం లోని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. కు సూచనలు అందినట్లు సమాచారం. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత కేంద్రం లోని యు. పి. ఏ. ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిటీని కలిసి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించి ఎన్నికల తేదీని నిర్ణయించాలని కోరే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి వర్షాలు బాగా కురవడం తో ఖరీఫ్ లో పంటల దిగుబడి పుష్కలంగా ఉంటుందని యు. పి. ఏ. ప్రభుత్వం ఆశిస్తోంది. ఖరీఫ్ పంట కోతలు ఫిబ్రవరి నాటికీ పూర్తి అవుతాయి. పంటల దిగుబడి బాగా ఉంటే దాని ప్రభావం మార్కెట్ పై పడి ధరలు తగ్గుతాయని ఆది పార్టీకి కలిసి వస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.


