| << Newer | Older >> |
on 2008/6/26 7:51:47
రాష్ట్ర మంత్రి వర్గం పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ అధిష్టనవర్గం క్లియరెన్స్ ఇవ్వడం తో ముఖ్య మంత్రి వై. ఎస్. కసరతు చేయనున్నారు. ఒకరిద్దరు మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశాలు కల్పించాలని కూడా సి. ఎం. బావిస్తున్నారు. మంత్రివరగం పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి గురువారం డిల్లీలో పార్టి అధినేత్రి సోనియాను కలిసి చర్చించారు. ఆమె కూడా వై. ఎస్. చెప్పినదంత విని ఆమోదం తెలిపారు. వై. ఎస్. కు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారని సమాచారం. ముందస్తు ఎన్నికలు రాకపోతే రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు వీలుంటుంది. మంత్రి వర్గ పునర్వ్యవస్థి కరణలో ఈ సారి కాపు వర్గీయులకు అవకాశంకల్పించవచ్చునని తెలిసింది. చిరు పార్టి ఆగస్ట్ లో ఏర్పాటు కావడం తద్యం అని స్పష్టం కావడంతో పార్టీలోని కాపు వర్గీయులను సంతృప్తి పరచడానికి వై.ఎస్. వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని బావిస్తున్నారు. ఇక తన వర్గీయులకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. చాలా కాలంగా ఆయన తన వర్గీయులకు మంత్రి పదవులు కట్టబెట్టాలేదు. వారిని కూడా తృప్తి పరచాలని సి. ఎం. అనుకుంటున్నారు. శాసన మండలి సభ్యులకు కూడా మంత్రివర్గం లో స్థానం కల్పించడం ద్వారా తమ ప్రభుత్వం మండలికి ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తుందో వై. ఎస్. చెప్పదలుచుకున్నారు. ప్రస్తుత మంత్రుల్లో సరిగా పనిచేయని వారి పై వై. ఎస్. చాలా అసంతృప్తి తో ఉన్నారు. అలాంటి వారికి ఉద్వాసన పలకవచ్చు. తన తన మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికైన జీవన్ రెడ్డి కి ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు, మూడు రోజుల్లో మంత్రివర్గం చోటు కల్పించారు. అప్పుడే మంత్రివర్గం లో మార్పులు చేర్పులు జరుగుతాయని అందరు అనుకున్నారు. అయితే మూఢం వల్ల మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ చేపట్టలేదు. తన ఒక రోజు డిల్లీ పర్యటనకు గురువారం వెళ్ళిన ముఖ్య మంత్రి సోనియాను కలిసి ఉప న్నికల ఫలితాలపై సమగ్ర నివేదికను సమర్పించి, మంత్రివర్గం లో మార్పులు చేర్పులకు అనుమతి పొందారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఒక్కటే మిగిలింది. త్వరలోనే ఆది కూడా పూర్తి కావచ్చు. ముందస్తు ఎన్నికలు రాకపోతే మంత్రివరం లో మార్పులు, చేర్పులు జరగడం ఖాయమని అంటున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



