| << Newer | Older >> |
on 2008/10/13 5:54:56
ప్రజారాజ్యం పార్టీ వరంగల్ శాఖలో అభిమానులకు, పార్టీ నేతలకు మధ్య విభేదాలు మొదలైంది. సోమవారం జరిగిన సభ గొడవ కు దారి తీసింది. ఆ గొడవ కుర్చీలు విసురుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చెప్పు ళ్ళు విసురుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ కమిటీల్లో అభిమానులకు స్థానం కల్పించక పోవడం , ముగ్గురు పార్టీ పరిశీలకులు విడి విడిగా గా వచ్చి కార్యకర్తల సమావేశం లో పాల్గొనడం తో గొడవ జరిగిందని సమాచారం. ముందు వేణుగోపాల్, గూడూరు సత్యనారాయణ రెడ్డిలు వేర్వేరుగా వచ్చి సమావేశం లో పాల్గొని వెళ్ళిపోయారు. మరో పరిశీలాకుణిగా సిద్దార్థ గౌడ్ వచ్చారు. ఆయనను చూడగానే చిరంజీవి అభిమానులు రెచ్చిపోయి వెనక్కు వెళ్ళిపొమ్మని నినాదాలు చేశారు. సిద్దార్థ గౌడ్ పై దాడికి దిగడానికి కూడా అభిమానులు ప్రయత్నించారు. దాంతో ఆయన అనుచరులు డాడీని అడ్డుకోబోయారు. వారిని అభిమానులు చితక బదరు. చివరికి పోలీసులు జోక్యం చేసుకొని సిద్దార్థ్ గౌడ్ ను బైటికి తీసుకెళ్లారు. దాదాపు రెండు గంటలపాటు జరిగియం ఈ గొడవలో సిద్దార్థ్ గౌడ్ వెనక్కు వెళ్ళి పోవాలంటు నినాదాలు చేసియన్ అభిమానులు ఆయన పై కుర్చీలు విసిరారు. చెప్పులు కూడా విసిరారని సమాచారం.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



