| << Newer | Older >> |
on 2008/5/10 8:15:12
రాష్ట్ర ప్రబుత్వం విడుదల చేసిన పరిహారం పై రైతులు పెదవి వి రుస్తున్నారు. రెండు నెలల కిందట కురిసిన ఆకాల వర్షాల కారణంగా రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లింది. 50 శాతం పైగా పంట నష్ట పోయిన రైతులకు మాత్రమే పరిహారం అందివ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు అధెశాలు జారీ చేసింది. తదనుగుణంగానే శనివారం 167 కోట్ల రూపాయలు పరిహారంగా విడుదల అయింది. ఆకాల వర్షాల వల్ల 10. 50 లక్షల ఎకరాల్లోని 50 శాతం పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రకృతి వైప రీత్యాల విభాగం అంచనా వేసింది. ఆ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. రైతుల కోరేక మేరకు ఖరీఫ్ లో ఉత్పాడకల కొనుగోలుకు ఈ పరిహారాన్ని రాయితీగా ఇవ్వనున్నారు. ఆకాల వర్షాల వల్ల రంగు మారిన వాణిజ్య పంటలను కొనుగోలు చేయాలని అప్ప్ట్ల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఆది అమలు కాలేదు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



