| << Newer | Older >> |
on 2008/10/13 5:23:46
ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అందరికన్నా ముందు అక్కడి కి వెళ్ళి వాలేది రాజకీయ పార్టీలే. బాధితులను పరామర్శించే పేరుతో ఈ పార్టీలు చేస్తున్న దే మి టి? సంయమనం పాటించాలని ప్రజలను కోరాల్సిన పార్టీలే వారిని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో రాజకీయ నేతలు ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోమవారం ఒక్క రోజునే టి. డి. పి. , ప్రజారాజ్యం, సి. పి. ఎం.,పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు, అల్లు ఆరవింద్, నోముల నరసింహమయ్య, ఆదివారం కె. సి. ఆర్., అంతకన్నా ముందు బి. జె. పి. నేతలు. ఎం. ఐ. ఎం . నేతలు అదిలాబాద్ జిల్లా లోని భైంసా కు పరుగులు దిశారు. దుర్గా మాత శొభా యాత్ర సందర్భంగా మొదలైన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కర్ఫ్యూ కు దారి తీసింది. గత నాలుగురోజులుగా భైంసా లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది గాయాల పాలయ్యారు. శాంతి బధ్రతల పరిరక్షణకోసం పోలీస్ యంత్రాంగం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా రప్పించింది. ఒకపక్క కర్ఫ్యూ కొనసాగుతున్నా వాటొలీ లో ఒక మతానికి చెందిన ఆరుగురుని సజీవదహనం చేసిన మతోన్మాదుల మారణకాండ ఎంతటి అమానుశామో అందరు ఒక్క సారి ఆలోచించాలి. నిద్రిస్తున్న అమాయకులను సజీవ దహనం చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ఆ ముష్కరులకు మానవత్వం ఇసు మంత కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. గొడవలు, ఘర్షణలతో సంభందం లేని వారి ప్రాణాలను హరించడం ద్వారా ఏమీ సాదించదలుచుకున్నారో పాషాణ హృదయులైన వారికే తెలియాలి. ఏ కులం , మతం అన్నది కాడుఇ ముఖ్యం వారంతా అమాయకులు, కులీ నాలి చేసుకొని పొట్టపోసుకునే వారి పై అంత ద్వేషం ఎందుకు? భైంసా సున్నితమైన ప్రాంతం అని పోలీసు యంత్రాంగానికి తెలుసు. గతం లో అక్కడ మాత ఘర్షణలు జరిగాయి. 1996 లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన అల్లర్లలో ఇద్దరు మృతి చెందారు. అక్కడ రెండు నెలలు కర్ఫ్యూ పెట్టారు. దానికి ముందు కూడా అదిలాబాద్ జిల్లాలో మాత ఘర్షణలు జరిగిన ధాఖలాలున్నాయి. ఈ నేపథ్యం లో అప్రమత్తంగా వ్యవహరించైసియన్ పోలీస్ యంత్రాంగం కొద్దిగా ఎమరుపటుగా ఉండటం తో ఇతాంతి ఉపద్రవానికి కారణ మైంది. ముందు జాగ్రత్తలు తీసుకోక పోగా, కనీసం ఘర్షణలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోనుంటే బాగుండేది. పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాలి. ఇక రాజకీయ నేతలు కూడా ప్రజలను రెచ్చగొట్టే ల వ్యవహరించకుండా చూడాలి. రాజకీయ లబ్ది కన్నా ఘర్షణలను నివారించడానికి చేపట్టే చర్యలకు ఉతం ఇవ్వాలి. పరిస్థితిని చక్కదిద్దుతున్న అధికార యంత్రాంగానికి సహకారాన్ని అందివ్వాలి. మతోన్మాద శక్తులను కూడా ఉక్కుపాదం తో అణచివేయడానికి ప్రభుత్వం కూడా పూనుకోవాలి. ప్రభుత్వం విచారణకు ఆదేశించడం హర్చించ దగ్గదె. విచారణ అనథరం ధొషులుగా తేలిన వారి పై కఠినంగా వ్యవహరించాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



