| << Newer | Older >> |
on 2008/6/25 6:55:50
తెలుగుదేశం పార్టీ నుంచి దేవేందర్ గౌడ్ నిష్క్రమించి రెండు రోజులైనా ఆ పార్టీ ఇంకా కలవరానికి గురవుతోంది. పార్టీ లోని ప్రతి వారి కదలికల పై చంద్రబాబు నిఘా ఉంచుతున్నారు. ముఖ్య నాయకులతో నిరంతరం టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. దేవేందర్ గౌడ్ పార్టీ ని వీడినా తమకు ఎలాంటి నష్టం లేదని పైకి చెబుతున్న లోపల మాత్రం ఆయన వల్ల ముందు ముందు మరెంత నష్టం కలుగుతోందొ నని చంద్రబాబు కలవరపడుతున్నారు. ఈ నెల 28 న దేవేందర్ నిర్వహించనున్న సభ అనంతరం పార్టీ నుంచి గౌడ్ గుటి కి పెద్ద సంఖ్యలో వలస వెళుతరన్నా భయం పార్టీని పట్టి పీడిస్తోంది. ఈ వలసాలను ఎలా నిరోధించాలన్న దానిపై పార్టీ మల్ల గుల్లాలు పడుతోంది. తెలంగాణా ప్రాంతం నుంచి ఎక్కువ మంది గౌడ్ పార్టీలోకి వెళ్ళ కుండా నీరోదించడానికి టి. డి. పి. చేస్తున్న ప్రయత్నాలు, నచ్చ చెప్పడాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీని వదిలి వెళ్ళ కుండా చూడటానికి తాయిలాలను ఇస్తామని ఆశ చూపుతున్నారని సమాచారం. కొంత మంది సీనియర్ నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారని తెలిసింది. వేణుగోపాలాచారి మాత్రం అందుబాటులో లేరు . మిగిలిన వారిని బుజ్జ గించినట్లు తెలిసింది. కోర్ కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేయాలని నిర్ణయించిన ఎర్రబల్లిని రంగం లోకి దించి తెలంగాణా లోని పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపే బాధ్యతలను అప్పగించారని తెలిసింది. పార్టీలో ఉన్న దేవేందర్ గౌడ్ వర్గీయులు పార్టీలో జరుగుతున్న విషయాలను ఎప్పటికపుడు గౌడ్ కు చేరవేస్తున్నారని తెలిసింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




