| << Newer | Older >> |
on 2008/6/27 5:01:02
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత , ప్రస్తుత ఎం. ఎల్. ఏ. చెన్నమనేని రాజేశ్వర రావు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయరాదని దాదాపుగా నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణకు సానుకూలంగా వ్యవహరించిన ఆయన దేవేందర్ గౌడ్ తరువాత టి. డి. పి. నుంచి బైటకు వస్తారని అందరు అనుకున్నారు. మొదట ఆయన కూడా అలాంటి సంకేతాలనే అందించారు. ఆ తరువాత ఎం జరిగిందో తెలియదుకాని టి. డి. పి. లోనే కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు. దేవేందర్ గౌడ్ తెలంగాణాకోసం సాగిస్తున్న పోరాటానికి తన సంఘీభావాన్ని తెలిపినప్పటికీ కొన్ని కారణాల వల్ల పార్టీ నుంచి బైటకు రాలేనని చెన్నమనేని చెబుతున్నారు. దేవుపల్లి లో ఇటీవల జరిగిన టి. డి. పి. కోర్ కమిటీ సమావేశానికి హాజరు కావడానికి వెళ్ళిన దేవేందర్గౌడ్ కు చెన్నమనేని తెలంగాణా పై ఒక డాక్యుమెంట్ ను రూపొందించి ఇచ్చి చంద్రబాబుకు అందివ్వమని చెప్పిన విషయం విదితమే. చెన్నమనేని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుని రంగం లోకి దింపవచ్చునని తెలిసింది. కొంత కాలంగా ఆయన ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. ఇక ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది. చెన్నమనేని లాంటి సీనియర్ నేత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం అంటే ఆది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కారమేనని చెప్పవచ్చు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



