Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/10/9 10:39:30

ప్రజల సహకారం తో గద్దె నెక్కిన పెద్దలు గద్దల్ల మారిపోతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శల వర్షం కురిపించారు. విజయదశమి రోజున అరసవిల్లి లో సూర్యనారాయణ స్వామికి పూజాధికాలు నిర్వహించిన చిరంజీవి అనంతరం అక్కడ రోడ్ షో లో పాల్గొన్నారు. ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకొని పడ్డారు. అధికారం లో ఉన్న వారు సామాన్య ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ఎంతసేపు తమ ఏదుగుదలనే చూసుకుంటున్నారని నిప్పులు కక్కారు. వందలాది ఎకరాల భూములు నేతలకు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ప్రభుత్వాల్లో ప్రజా ప్రతినిదుల్లొ జవాబుదారీ తనం కొరవడిందని ఆరోపించారు. ప్రజల అవసరాలు తీర్చాలన్న విషయాన్ని ప్రభుత్వాలు విస్మరించాయని వాపోయారు.
చిరంజీవి ప్రసంగం సాంతం ఆలకిస్తే గతం లో అధికారం లో ఉన్న అన్ని ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. ఆ పార్టీ ఇ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలను టార్గెట్ చేసుకున్నారు. ఏ రాజకీయ పార్టీని నేరుగా విమర్శించలేదు. ఆయన ఆరోపణలు విమర్శ లన్ని పరోక్షంగానే సాగాయి. డైలాగులు బాగానే ఉన్న ఆది ప్రజలను ఆకర్షించలేక పోయింది. నాలుగేళ్ళ క్రితం నాలుగు ఎకరాలు కూడా లేని నాయకులు ఇప్పుడు వందలాది ఎకరాలను ఎలా సంపాదించారో నిలదిద్దాం రమ్మని ప్రజలను పిలవడం గమనార్హం. ఎక్కడ కూడా చిరంజీవి నేరుగా ఎవరి పై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయలేదు. తన రథం నుంచి అభివాదం చేస్తూ ప్రసంగించారు. ప్రజల ఆస్తులకు కాపలా ఉండాల్సిన నాయకులే భూములను కైవసం చేసుకుంటున్నారని అలాంటి వారిని నిలదిద్దాం రండి అని పిలుపు ఇచ్చారు. ఒక్క విషయం చిరంజీవి మార్చిపోయారు. నిల దియండి అని అని అనడం వేరు రండి నిలదిద్దాం అని అనడం వేరు. చిరంజీవి ప్రసంగం లో ఎక్కడ అలాంటి మాటలు కనిపించలేదు. యువతను టార్గెట్ చేసుకున్న తీరు కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది. చిరంజీవి విసిరిన డైలగ్‌లు వింటుంటే కాస్త అలనాటి ఎన్. టి. ఆర్. ను అనుకరించడానికి ప్రయత్నించారని అనిపించింది. 1982 లో ఎం. టి. ఆర్. తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను 'కుక్క మూతి పిందెలని' నేరుగానే విమర్శించారు. ఇపుడు చిరంజీవి అలాంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. ప్రజల సహకారం తో గద్దె నెక్కిన పెద్దలు గద్దలుగ మారిపోతున్నారని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.





Related Stories:

  • అగ్ని ప్రమాదం
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • వివాదానికి కారణం ఏమిటి?
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • కె.సి. ఆర్. బస్సు యాత్ర 22 నుంచి
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • పులివెందుల్లో టెన్షన్-- టెన్షన్
  • తెలంగాణా లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితే
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • దేవేందర్ రాజకీయం
  • దేశవ్యాప్త బంద్ 20న
  • పి. ఆర్. పి. నిరసన ప్రదర్శన రేపు
  • టి. డి. పి. వైఖరి మారుతుందా!
  • నన్ను క్షమించండి : చంద్రమోహన్
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |