| << Newer | Older >> |
on 2008/6/24 9:37:19
తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు తన కోటరీని తిరిగి కొత్తగా నియమించుకోనున్నారు. దానికోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. టి. డి. పి. వ్యవస్థాపక అధ్యక్షుడు, అప్పటి ముఖ్య మంత్రి ఎన్. టి. ఆర్. ను పదవి లోనుంచి తప్పించడంలో బాబుతో కలిసికీలక పాత్ర పోషించిన బాబు కోటరీలోని నలుగురి ముఖ్యుల్లో ఒకరు మృతి చెందారు. ఒకరు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు సస్పెండ్ అయితే మరొకరు చురుకుగా లేరు. దాంతో తన కోటరీ సంఖ్యను పెంచి పార్టీకి మరింత విశ్వాసం తో పని చేసే వారికి అవకాశం కల్పించాలని బాబు బావిస్తూన్నారు. చోడబోతే తన మాటను తూచా తప్పకుండా అమలు పరిచే వారు,అత్యంత విధేయులకే కోటరీలో చోటు కల్పించాలని అనుకుంటున్నారు. బాబు కోటరీలో చాలా చురుకుగా పనిచేసిన దేవేందర్ గౌడ్ ఆయనను వదిలి వెళ్లిపోవడం తో కొత్త కోతారీకి రూపకల్పన చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. మాధవా రెడ్డి, మృతి చెందారు, కోటగిరిని పార్టీ సస్పెండ్ చేసింది. అశోక్ గజపతి రాజు చురుకుగా పనిచేయలేక పోతున్నారు. పార్టీలో చురుకుగా పని చేస్తూ తనకు విధేయంగా ఉన్న వారిని ఎంపిక చేసి వారితో కొత్త కోటరీ ని ఏర్పాటు చేయనున్నారు. బాబు కోటరీలో చోటంటే ఒక రకంగా పార్టీలో మంచి గుర్తింపు అని అనుకోవాలి. దాంతో పాటు వ్యక్తిత్వం గురించి ఆలోచించని వారికే పదవి దక్కవచ్చు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




