| << Newer | Older >> |
on 2008/5/5 6:29:18
తెలంగాణా సెంటిమెంట్ దెబ్బ ఎంత బలమైనదో చూపాలన్న ఒకే ఒక ధెయతం తో ఉపఎన్నికలను కోరి కొని తెచ్చుకున్న ట్ రామాయంపేట చేర్యాలఏలంగాణా రాష్ట్ర సమితి (టి. ఆర్. ఎస్. ) ఈ ఉపఎన్నికల్లో అంతకన్నా ఎక్కువగా వర్గపోరు పార్టీలోని కుమ్ములాతాళతో సతమత మౌతోంది. పార్టీ అభ్యర్థులను ప్రకటించే ముందు తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని అధినాయకత్వానికి చేసిన విన్ఞాపాలు పెడచెవిన పెట్టిన నాయకత్వానికి తమ ప్రతాపం ఒకసారి చూపాలాని కార్యకర్తలు, ద్వితీయ శ్రేనిఎతలు బావించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణా ప్రాంతాల్లో కనీసం ఐదు నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్థులను మార్చాలని ఆయా నియోజక వర్గాల నేతలు పార్టీ నాయకత్వానికి సుచిన్చరు.తెలన్గన సెంటిమెంట్ ఎంతో బలంగా ఉందని ఈ తరుణం లో అభ్యర్థులను మార్చడం వల్ల ప్రత్యర్థ పార్టీల విమర్శలకు జవాబు చెప్పడం కన్నా పార్టీలోని వారిని బుజ్జగించడంతెలీకని నాయకత్వం బావించింది. పార్టీనిగాని, నియోజకవర్గాల్లోని నేతలను గాని గౌరవించని లెక్క చేయని వారిని అభ్యర్థుల నిలపడాన్ని సహించలేని నేతలు నాయకత్వానికి బుద్ది చెప్పడానికి ప్రస్తుతం భారీ ఉన్న వారిని ఓడించాలని నిర్ణయించుకోవడం తో పార్టీ నాయకత్వం కలవర పడుతోంది. సెంటిమెంట్ కన్నా వర్గపోరు బలంగా ఉందన్న విష్యం తెలుసుకున్న నాయకాత్వాశ్మ్ ద్వితీయ శ్రేణి నేతలను కార్యకర్తలను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. అభ్యర్థులు ఎవరన్నదానికన్నా తెలంగాణా వాదం ముఖ్యమని, సెంటిమెంట్ ప్రధానమని చంద్రశేఖర రావు చేసిన విజ్ఞప్తులను నేతలు పట్టించుకోవడం లేదు. బలంగా ఉందనుకున్న తెలంగాణా వాదం అసంతృుప్తుల వల్ల , వర్గ పోరు వల్ల బలహీన పడటాన్ని పార్టీ అధి నాయకత్వం జీర్ణించుకోలేక పోతోంది. ఆలేరు, స్టేషన్ ఘనపూర్, జేడ్చర్ల, ఖానాపూర్,రామాయంపేట,చేర్యాల అసెంబ్లీ నియోజక వర్గాలనుంచి టి. ఆర్. ఎస్. తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్తు ఏమిటన్నది పోలింగ్ తరువాత గాని చెప్పడం సాధ్యం కాదు. కార్యకర్తల నిరసనాలు, నేతల ఆగ్రహాలు ఆభర్తుల పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వేచిచూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



