| << Newer | Older >> |
on 2008/5/3 4:55:32
చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ప్రజప్రతినిదులు అటు పార్లమెంట్ సమావేశాల్లో గాని, ఇటు అసెంబ్లీ సమావేశాల్లో గాని వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నిరసనాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజప్రతినిదులు ప్రజలకు జవాబుదారీ తనం వహించాలన్న కనీస విషయాన్ని విస్మరించి చట్ట సభల్లో మాసాలుతున్న తీరు అభ్యంతరకరమని తెలిసినా ఆ ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో కించిత్తు కూడమార్పు రావడం లేదు. సభ గందరగోళం సృష్టించడం సభ సజావుగా సాగకుండా అడ్డుతగలడంతో సరిపెట్టుకోకుండా సభాపతి ని దిక్కరించి ఆయనను అవమానించే వీడంగా ప్రవర్తించడం సభ మర్యాదను మంట గలాపడం ఆనవాయితీగా మారింది. చట్ట సభ లో తాము ప్రవర్తిస్తున్న తీరును టి. వి. లలో ప్రత్యక్ష ప్రసారం అవుతోందన్న విషయం తెలిసినా ప్రతి చిన్న దానికి సభ కార్యక్రమం సాగకుండా అడ్డుతగలడం తమ హక్కుగా పరిగణిస్తూ సభ సజావుగా సాగకుండా గందర గోళం సృష్టించడం విలువైన సభ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు పై ప్రజలు ఏవాగించుకుతున్న ప్రజా ప్రతినిదులు మాత్రం 'నవ్వి పొదురు గాని మాకెంటి సిగ్గు' అనుకుంటున్నట్టు ఉంది. సభ ను నిర్వహించడం ఆషా మాషి విషయం కాదు. ఎంతో సహనం , ఓర్పు కావాలి. లోక్ సభ సభాపతి సోమ్నాథ్ గాని, అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి గాని సభను అంతో సంయమనం తో నిర్వహిస్తూ వస్తున్నారు. అలాంటి వారిపై కూడా ప్రజాప్రతినిధులు విమర్శలు గుప్పించడం మానడం లేదు. సురేష్ రెడ్డి కి పక్షపాతం ఆపాదిస్తూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయం లో ప్రదాన ప్రతి పక్షం ఆపాదించడం తెలిసిందే. అలాగే ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో సభ్యులువ్యవహారశైలి తో విసిగి పోయిన స్పీకర్ సోమనాథ్ సభ్యులను దారిలో పెట్టడానికి చేసిన సాదారణ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవని గ్రహించి చివరిగా 32 మంది ప్రతి పక్ష సభ్యుల ప్రవర్తన పై విచారణ జరపాలని సభ హక్కుల సంఘాన్ని ఆదేశీంచ్దం గమనిస్తే స్పీకర్ సభ్యుల తీరు పై ఎంత విసిగి పోయరో గ్రహించ వచ్చు. సభ్యుల ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి స్పీకర్ చేసిన యత్నాలన్ని ప్రయోజనం లేకుండా పోవడం స్పీకర్ పదివిని గౌవారించని సభకు సభాపతిగా ఉండటం అనవసరామన్న అభిప్రాయారానికి వచ్చిన స్పీకర్ గతం లో ఒక సారి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించ్దం కూడా జరిగింది. అప్పట్లో సభ్యులు తాం అటప్పును గ్రహించి స్పీకర్ కు క్షమాపణలు చెప్పడం సభ్యుల కోరిక మేరకు స్పీకర్ సోమనాథ్ తన నిర్ణయాన్ని వాపసు తీసుకోవడం జరిగింది. ఇంత జరిగిన తరువాత కూడా సభ్యుల వైఖరి లో ఏ మాత్రం మార్పు రాలేదు. దాంతో ఈ సారి సభ్యుల క్రమశిక్షణ రహిత్యాన్ని సహించని స్పీకర్ పార్లమెంట్ సభ్యులకు కూడా ప్రవర్తన నియమావళి లాంటిది ఉండాలని అభిప్రాయపడినట్లు కనిపిస్తోంది. స్పీకర్ ఆదేశాల మేరకు పార్లమెంటరీ హక్కుల కమిటీ కూడా కొన్ని సూచనలు చేయడం గమనర్హమ్.క్రమశిక్శన తప్పినా సభ్యులను గది లో పెట్టడానికి మొదట హెచ్చ్రించాలని. రెండో సారి కూడా అలాగే వ్యవహరిస్తే మండలించాలని అప్పిటికి మార్పు రాకపోతే సభ నుంచి సస్పెండ్ చేయాలని, అయినా మారక పోతే చివరిగా సభ నుంచి బహిష్కరించడమే కాదు సభ్యుల ప్రవర్తన నారంగా భావూస్తే చట్ట పరమైన చర్యలకు వెనుకాదరాదని కమిటీ సిఫార్స్ చేయడం హర్షదాయకం. కమిటీ సిఫార్స్ లు ఆచారంలోనికి వస్తే నైనా సభ్యుల ప్రవర్తన లో మార్పు వస్తోదెమో చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



