| << Newer | Older >> |
on 2008/9/29 10:51:04
హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చిన ఎం. ఐ. ఎం. అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ సోమవారం సాయంత్రం కన్ను మూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పోందుతున్నారు. సోమవారం మధ్యాన్నం నుంచి ఆయన ఆరోగ్యం పరిస్థితి విషమించింది. ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ప్రజల సందర్శన కోసం ఒవైసీ బౌతిక ఖాయాన్ని పార్టీ కార్యాలయం లో ఉంచనున్నారు. ఎం. ఐ. ఎం. పార్టీని స్థాపించి అసెంబ్లీకీ పార్లమెంట్ కు ఎన్నికైన ఓ. వై. సి. 2004 లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. తరువాత ఓ వై. సి. రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమారుడు ఆసాదుడ్దిన్ ఓ. వై. సి. చేజిక్కుంచుకున్నారు.1960 లో కార్పొరేతర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంబించిన ఒవైసీ అంచెలంచెలుగా ఎదిగారు.1962 నుంచి 1984 దాకా ఆయన చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తరువాత ఆయన పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 2004వరకు ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుల్లో ఆసాదుడ్దిన్ ఒవైసీ పార్లమెంట్ సభ్యులు కాగా, మరో కుమారుడు అక్బారుద్దీన్ ఎం. ఎల్. ఏ. గా ఉన్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



