| << Newer | Older >> |
on 2008/6/28 10:22:20
ఎన్నికలు ఎప్పుడొచ్చినా దానిని ఎదుర్కోడానికి సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ నేతలకు సూచించారు. సంస్థాగత అంశాల పై అంథోనీ కమిటీ సమర్పించిననివేదిక పై చర్చించడానికి శనివారం సోనియా గాంధీ నివాసం లో జరిగిన రాష్ట్రాల ఇన్ఛర్జీలు. ప్రధాన కార్యదర్శుల సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. పేరుకు అంథోనీ కమిటీ సిఫార్స్ పై చర్చ అని చెప్పినా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉండాలన్న విషయం పైనే సమావేశం చర్చించింది. పార్టీని పటిష్ట పర్చడంతో పాటు, ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, లోక్సభకు ముందస్తు ఎన్నికలు వస్తే దానిని ఎదుర్కోవడం పై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశం లో యు. పి. ఏ. , వామపక్షల మధ్య అణు ఒప్పందం పై జరిగిన చర్చలు గురించి మాత్రం ప్రస్తావించలేదు. యు. పి. ఏ లోని బాగస్వామ్య పార్టీలు ముందస్తు ఎన్నికలకు ఏ మాత్రం సుముఖంగా లేవు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



