| << Newer | Older >> |
on 2008/7/22 0:21:59
విశ్వాస పరీక్షకు ముందు సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో జరుగుతున్న చర్చ సంధర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతున్న సమయంలో సోనియా గాంధీ ఎంతో చికాకును వ్యక్తం చేయడం గమనార్హం. ఎందుకంత అసహనాన్ని ఆమె ప్రదర్శిస్తున్నారో ఎవరికి అంతు చిక్కడం లేదు. ప్రధాని మాట్లాడినపుడు ఎంతో హుషారుగా కనిపించిన సోనియా అద్వానీ మాట్లాడుతున్నానపుడు మాత్రం అసహనానికి గురి అయ్యారు. సభలో ఆమె ఇప్పటివరకు ఎలాంటి ప్రసంగం చేయలేదు. విపక్ష పార్టీల వారు ప్రసంగిస్తునపుడు అభ్యంతరాలను తెలుపలేదు. సి. ఎమ్.పి. లో అణు ఒప్పందం లేదన్న దానిపై అద్వానీ ప్రస్తావించినపుడు అధికారపక్ష సభ్యులు ఏమీ మాట్లాడక పోయినా సోనియా ఒక్కరే అభ్యంతరం చెప్పడం విశేషం. సి.ఎమ్. పి. లో. ఆది ఉందని మాత్రం అన్నారు. అద్వానీ చేస్తున్న ఆరోపణలకు బదులు చెప్పడానికి సిద్దం కావాలే కానీ ఆయన ఆరోపణలు చేస్తూ పోతుంటే సోనియా మాత్రం చాలా కోపంగా ఆయన వైపు చూస్తూ కూర్చున్నారు. సభలో విపక్ష సభులు చేస్తున్న ప్రసాగాన్ని ఓపికగా వినడం మాని తన పార్టీ వారితో అమె గుసగూసలాడటం కనిపించింది. సి. పి. ఎం .నేత సలీమ్ మాట్లాడుతున్నపుడు ఆయన ప్రధానిపై ద్వజం ఎత్తినపుడు కూడా సోనియా చాలా అసహనానికి గురైనారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




