| << Newer | Older >> |
on 2008/7/23 0:35:36
లోక్సభ విశ్వాస పరీక్ష కు దారితీసిన కారణలపై లోక్సభ లో అసలు చర్చజరగలేదు. అనవసర విషయాల పై రెండు రోజులు 16 గంటలపాటు జరిగిన చర్చ ఎందుకు కోరగకుండా పోయింది. అణు ఒప్పందం పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం లో అసలు చర్చకు నోచు కొలేదు. కేవలం వామపక్ష పార్టీకి చెందిన ఒక ఎం. పి. మాత్రమే అణు ఒప్పందం పై మాట్లాడారు. మిగిలిన సభ్యులంతా ఆవిషయాన్ని పక్కన పెట్టి మిగిలిన విషయలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. యు.పి. ఏ. ప్రభుత్వానికి నాలుగున్నరేళ్లుగా బై టి నుంచి మద్దత్తు ఇచ్చిన వామపక్షాలు అణు ఒప్పందం విషయం లోప్రభుత్వ వైఖరిని తప్పు పట్టాయి. ప్రతిపక్ష పార్టీలతో చర్చించకుండా సి. ఎం. పి. లో అణు అంశాన్ని చేర్చ కుండా చేసిన యు. పి. ఏ. ని తీవ్రంగా తప్పు పట్టాయి. అణు ఒప్పందానికి సంబందించి టోకియోలో జరిగిన జి-8 సదస్సులో ప్రధాని అణు ఒప్పందం ముసాయిదాను ఐ. ఏ. ఈ. ఎ. బోర్డ్ కు అప్పగించి ఆమోదానికి పంపడంపై కినుక వహించిన వామపక్షాలు ప్రభుత్వానికి మద్దత్తు ఉపసంహరించాయి. ఫలితంగా మైనార్టిలో పడ్డ మన్మోహన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష కు సిద్ద మైంది. యు. పి. ఏ. కు సమాజ్వాదీ పార్టీ అండ గనిలిచింది. విశ్వాస పరీక్ష తేదీ ఖరారు అయ్యింది. విశ్వాస ఓపరిక్ష కూడా జరిగింది. ప్రభుత్వం విజయం సాదించింది. . ఆ అంశం పై అయితే ప్రతి పక్ష పార్టీలు నానా రచ్చా చేసి దేశ వ్యాప్తంగా ప్రజాల్కా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించాయో ఆది మాత్రం జరగలేదు. ప్రభుత్వం సాదించిన విజయాలు, వైఫల్యాలు విధ్యుత్ కొరత, తదీర్థర అంశాల పైనే చర్చ జరిగింది. అణు ఒప్పందాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామన్న అంశం పై ప్రతి పక్ష పార్టీలు సభలో సరిన చర్చ , వాదన లేవనెత్టాలేక పోయాయి. అసలు 123 ఒప్పందం గురించి ప్రస్థవనే లేదు. అణు ఒప్పందం వల్ల దేశానికి జరగనున్న చేటు గురించి చర్చ జరగలేదు. అణు ఒప్పందం వల్ల దేశానికి మేలు జరుగుతుందని యు. పి. ఏ. కూటమి లోని పార్టీల సభ్యులు ఒక్క ముక్క లో చెప్పారు. ఎలాంటి మేలు జరుగుతుంది అన్న దానిపై వివరణ లేదు. రెండు రోజులు 16 గంతాల చర్చ వల్ల ప్రజలకు అణు ఓప్ప్నడం పై ఏ మాత్రం అవగాహన కల్పించలేక పోయిన ప్రజాప్రతినీడులు చివరికి విశ్వాస పరీక్షలో యు.పి. ఎ.సదిన్చిన విజయం తో సంబరాలు జరుపుకోడానికే పరిమిత మయ్యారు తప్ప మరేమీ చేయలేక పోయారు. ప్రజా ధనమ్మత్రం వృధా అయ్యైంది. కొన్ని వేళ కోట్ల రూపాయల ప్రజా ధనం ఒక రకంగా దుర్నివియోగం అయ్యిందని చెప్పాలి. కొండను తవ్వి చివరకు ఎలుకను కూడా పట్టలేక పోయిన మన ప్రజా ప్రతినుదుల నిర్వకానికి నావ్వాలో, ఎడ్వాలో కౌద అర్థం కానీ పరిస్థితి మనది. ! మేరాభారత్ మహన్ !!
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



