| << Newer | Older >> |
on 2008/7/18 18:28:45
తెలుగుదేశం పార్టీ కి రాయలసీమ లో మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు రామచంద్ర య్య పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ లో ఉన్నరామచంద్ర య్య చంద్రబాబు విధానాల తో విభేదించి పార్టీ వదిలి వెళ్లారు. 1980 ప్రాంతాల్లో ఆయన పార్టీలో చేరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. టి. ఆర్. . .విధానాలకు ఆకర్షితుడై ఆయన టి. డి. పి. లో చేరారు. రాయలసీమలో బలమైన బి. సి. నాయకుడిగా రామచంద్రయ్యకు గుర్తింపు ఉంది. ముఖ్య మంత్రి వై. ఎస్. సొంత జిల్లాకడప జిల్లాలో ఆయనకు పోటీగా ఎదగడానికి రామచంద్ర య్య చాలా కృషి చేశారు. ఎన్. టి. ఆర్. క్యాబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. చాలా కాలంగా రాజ్య సభ సభ్యుడిగా ఉన్నారు. రామచంద్ర య్య పార్టీ నుంచి వెళ్ళిపోతారని గత రెండు వారులుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ కష్ట కాలం లో ఉన్నపుడు రామచంద్ర య్య పార్టీని వీడాలని నిర్ణయించుకోవడం పార్టీని కుదిపేసింది. పార్టీ నుంచి వెళ్లిపోవద్దని సినీనటుడు బాలకృష్ణ కూడా ఆయనకు సూచించారు. అయిన ఆ ఆయన నిర్ణయం లో మార్పు రాలేదు. పార్టీకి చెందిన ఒక్కో సీనియర్ నాయకుడు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ సీనియర్ నాయకుడు కోటగిరి ని పార్టీ సస్పెండ్ చేసింది. దాంతో ఆయన పార్టీకి దూరం అయ్యారు. తరువాత పార్టీలో నెబర్ 2 గా ఉన్న బి. సి. నేత దేవేందర్గౌడ్ కూడా పార్టీని వదిలారు. గత నెలలో రాయలసీమ లోని కర్నూల్ జిల్లాలు చెందిన మరో సీనియర్ నాయకుడు భూమ నాగిరెడ్డి, ఆయన భార్య శోభా నాగిరెడ్డిలు పార్టీకి గుడ్బై చెప్పారు. ఇపుడు రామచంద్ర య్య పార్టీని వదిలి వెళ్లారు. ఇప్పటిదాకా పార్టీ నుంచి వెళ్ళిన వారంతా చిరు పార్టీ లోకి వెళ్లనున్నావరే కావడం విశేషం.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




